కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం 'జయపురం' గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగం అధ్యక్షులు కనకమేడల రవీంద్రకుమార్ ను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రవీంద్రకుమార్ కు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 22 ఏళ్లుగా పార్టీ న్యాయవిభాగంలో ఉంటూ సేవలందిస్తున్నారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ సభ్యుడిగాను క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా, పార్టీ న్యాయ విభాగానికి సేవలందిస్తున్న సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దిల్లీలో ఉన్న అవసరాల దృష్ట్యా, ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగాను రవీంద్రకుమార్ ను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తెదేపా ఎంపీలు పోరాడుతున్న సమయంలో ఆ బృందంలో న్యాయసంబంధిత అంశాల్లో నిపుణుడు ఉంటే మంచిదన్న ఉద్దేశంతోనే రవీంద్రకుమార్ ను రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాజ్యసభకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైనందువలన రాజ్యసభకు కనకమేడల రవీంద్రకుమార్ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే.
Thalapathy 1) Kadambur Raju (AIADMK) Kovilpatti 2) Dr.A R Raguraman (MDMK) Sattur 3) A R R Seenivasan (DMK) Virudhunagar 4) G Thalapathy (DMK) Madurai - West 5) P R G Arun Kumar (AIADMK) Coimbatore 6) M K Mohan (DMK) Anna Nagar 7) P K Sekar Babu (DMK) Chennai - Harbour 8) A C Vilvanathan (DMK) Ambur 9) A P Nanda Kumar (DMK) Anaikattu
Comments